Read more!

English | Telugu

యానిమల్ త్రిప్తి కి బంపర్ ఆఫర్..రామ్ చరణ్ హీరోయిన్ ని తప్పించారు

యానిమల్ తో ఒక్కసారిగా ఇండియన్ సినీ ప్రేమికుల మనసుల్లో గిలిగింతలు రేపిన భామ త్రిప్తి డిమ్రీ. ఆమె కోసమే  చాలా మంది యానిమల్ ని రిపీటెడ్ గా చూశారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇప్పడు ఈ సినిమా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యి కూర్చుంది.

హర్రర్  కామెడీ తో  తెరకెక్కిన  భూల్ భూలయ్యా పార్ట్ 1 ,2  లు చాలా పెద్ద విజయాన్నే సాధించాయి. అలాగే హిందీ చిత్ర సీమలో సరికొత్త ట్రెండ్ ని కూడా క్రియేట్ చేసాయి. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేస్తు  భూల్ భూలయ్యా  3 వస్తుంది. ఇందులోనే  త్రిప్తి నటించనుంది. ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. తన క్యారక్టర్ ద్వారా త్రిప్తి ప్రేక్షకులకి  థ్రిల్ అండ్ చిల్ ని అందించబోతుందని కూడా మేకర్స్ చెప్పడం పలువురిని ఆకర్షిస్తుంది. పార్ట్ 2 లో కియారా అద్వానీ చేసిన రోల్ లోనే  ఇప్పుడు త్రిప్తి నటించబోతుంది. దీంతో  బాలీవుడ్ మొత్తం ఈ విషయం  బ్రేకింగ్ న్యూస్ గా కూడా  మారింది. మరి త్రిప్తి  కియారాని మరిపిస్తుందో లేదో చూడాలి. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తున్న  గేమ్ చేంజర్ లో నటిస్తుంది .

2007 లో ప్రారంభం అయిన భూల్ భూలయ్యా సిరీస్  హిందీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. పార్ట్ 1 లో  అక్షయ్ కుమార్, విద్యాబాలన్, అమీషా పటేల్ లు నటించగా  పార్ట్ 2 లో  కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ లు నటించారు.మొదటి రెండు భాగాలు ఒక దాన్ని మించి ఒకటి విజయం సాధించడంతో  పార్ట్ 3  పై  అందరిలోను అంచనాలు భారీ  ఎత్తున వున్నాయి. రెండవ భాగానికి దర్శకత్వం వహించిన అనీస్ బాజ్మీనే పార్ట్ 3  కి కూడా  దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 దీపావళి కి  మూవీ థియేటర్లలో మెరవనుంది.